గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వం పనే

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ప్రభుత్వం పనే

ఇటీవల గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక ప్రభుత్వం వుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య శనివారం గన్నవరంలో దాడికి గురైన టీడీపీ కార్యాలయాలన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుందని ఎస్పీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులకు ముందే తెలుసునని ఆయన ఆరోపించారు. పోస్టింగ్ ఇవ్వరన్న భయంతోనే జిల్లా ఎస్పీ అన్ని విషయాలు గోప్యంగా వుంచుతున్నారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన తేల్చిచెప్పారు.  

వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారమే గన్నవరంలోని తమ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆరోపించారు. కొంతమంది పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. తనను పర్యటించొద్దు అనడానికి పోలీసులు ఎవరు.. బెదిరిస్తే పారిపోతామా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ను నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు వెళ్లారని.. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. దొంగలాటలు వద్దు.. లగ్నం పెట్టుకుందాం, తాడోపేడో తేల్చుకుందామని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా జగన్ రావాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.