వరంగల్ టెన్త్ పేపర్ లీక్ కేసులో జిల్లా కోర్టులో పోలీసులకు చుక్కెదురు
వరంగల్ టెన్త్ పేపర్ లీక్ కేసులో జిల్లా కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. పేపర్లీకేజీ కేసులో నిందితులకు ఊరట కలిగింది. పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన హన్మకొండ కోర్టు. ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో నిందితుడికి రూ. 20 వేల పూచికత్తుపై బెయిల్ఇచ్చింది.