ఎమ్మెల్యే పైళ్ళ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

ఎమ్మెల్యే పైళ్ళ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

వలిగొండ (ముద్ర న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు మరియు భువనగిరి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా అభివృద్ధి పరుస్తూ, నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఆపద వచ్చినవారికి నేనున్నాను అంటూ ధైర్యాన్ని అందిస్తూ, మనసున్న మారాజు గా పేరుగాంచిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వలిగొండ మండలం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వేముల కొండ ఎంపీటీసీ సామ రామ్ రెడ్డి, ముద్దపురం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి ఉప్పల్ రెడ్డి, ఉప సర్పంచ్ జక్క నర్మద వెంకటరెడ్డి, ముద్దపురం కాంగ్రెస్ గ్రామ శాఖ  అధ్యక్షుడు చీరక వెంకట్ రెడ్డి లతో  పాటు ముద్దాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మంది సోమవారం రోజున హైదరాబాదులోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పైళ్ళ రాజవర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి పాల్గొన్నారు.