వైభవంగా షిరిడి సాయి ఆలయ ప్రతిష్టాపన

వైభవంగా షిరిడి సాయి ఆలయ ప్రతిష్టాపన

మెట్‌పల్లి ముద్ర:- మండలంలోని జగ్గసాగర్ గ్రామ శివారులో నిర్మించిన షిరిడి సాయిబాబా ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, స్వస్తిపున్యాహవచనం, పంచాంగ శ్రవణ, ఋత్వికరణ, అగ్ని ప్రతిష్ట, అంకురార్పణ కార్యక్రమంలు నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య సాయిబాబా, దత్తాత్రేయ, శివానందీశ్వర, గణపతి విగ్రహాలను గ్రామంలోని పుర వీధుల్లో ఊరేగించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్గం రాజా గంగారం, లోలం బోజయ్య, ముదం నర్సింహులు, అరిగేలా ముత్తన్న, లింగారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.