సద్దుల చెరువుకు అంతర్జాతీయ సొబుగులు

సద్దుల చెరువుకు అంతర్జాతీయ సొబుగులు
  • ప్రఖ్యాత డీజైనర్లతో ప్రణాలికలు
  • బోటింగ్ తో షికారు ఏర్పాట్లు
  • మినీ ట్యాంక్ బండకు చేరిన టూరిజం బోట్ లు
  • శుభాకార్యాల నిర్వహణ కోసం మినీ క్రూయిజ్ షిప్ ఫైబర్ జెట్ లు
  • మెడిటేషన్ సెంటర్ తో పాటు ఓపెన్ జిమ్
  • సృజనాత్మకతకు అద్దం పట్టే రీతిలో క్రీడా కేంద్రాలు
  • అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు
  • విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ముఖద్వార నిర్మాణాలు
  • సద్దులచెరువు@ మినీ ట్యాంక్ బండ్ ను సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న టూరిజం కార్పొరేషన్ యం డి మనోహర్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్@సద్దుల చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. గురువారం ఉదయం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ యం డి మనోహర్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, ఆడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ హేమంత్ కేశవ్ పాటిల్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి లతో కలసి ఆయన సద్దుల చెరువు ను సందర్శించారు.

మినీ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల విహారం కోసం త్వరలో బోట్ షికారును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టూరిజం బోట్ లు మినీ ట్యాంక్ బండ్ కుచేరుకున్నాయన్నారు. అంతే గాకుండా ట్యాన్క్ బండ్ మధ్యలో పుట్టిన రోజు, పెళ్లి రోజు లాంటి శుభకార్యాల ఏర్పాటు కోసం మినీకృయిజ్ షిప్ ఫైబర్ జెట్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. దానికి తోడు ప్రత్యేకించి వాకర్స్ కోసం మెడిటేషన్ కేంద్రంతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. దానికి తోడు చిన్నారుల కోసం సృజనాత్మకతకు అద్దం పట్టే రీతిలో క్రీడా కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయికనుగుణంగా నిర్మాణాలతో పాటు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ముఖద్వారనిర్మాణాలు చేపట్ట బోతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు.