మట్టపల్లి కి బస్సుల ఏర్పాటు పై హర్షం 

మట్టపల్లి కి బస్సుల ఏర్పాటు పై హర్షం 

మఠంపల్లి ,ముద్ర:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కు ఆర్టీసీ బస్సులు ప్రారంభించినందుకు గాను హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి కి దేవాలయ పాలక మండలి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పాలక మండలి చైర్మన్  చెన్నూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఆర్టీసీ వారు దేవస్థానం కు బస్సులు నిలిపివేశారని దేవస్థానం తరుపున అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించలేదన్నారు.

భక్తుల సమస్యను దృష్టిలో ఉంచుకొని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి కి విన్నవించగా వెంటనే స్పందించిన ఆయన కోదాడ డిపో మేనేజర్ తో మాట్లాడి దేవస్థానం కు బస్సులు ఏర్పాటు చేయడం పట్ల పాలకవర్గం ఎమ్మెల్యే సైదిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు, కుమ్మరికుంట్ల వెంకట నారాయణ, మన్నెం శేషిరెడ్డి,కండే వెంకటేశ్వర్లు,పాశం శ్రీనివాస్ రెడ్డి,గుండా కొండల్ రెడ్డి,చాట్ల రామకృష్ణ తదితరులు ఉన్నారు.