మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి

మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, ప్రజాపక్షం సంపాదకులు కే. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదివారంనాడు జీవో జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారని జీవోలో పేర్కొన్నారు.  శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా పని చేశారు.

మూడు  దశాబ్దాల అనంతరం ఆయన మళ్లీ ఈ పదవిలో నియమితులయ్యారు. దేశంలో జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల ఐజేయూ, టీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే నాయకులు హర్షం వ్యక్తం చేశారు.