రాష్ట్రానికి త్వరలో అమిత్ షా, నడ్డా

రాష్ట్రానికి త్వరలో అమిత్ షా, నడ్డా

ముద్ర, తెలంగాణ బ్యూరో: బీజేపీ ముఖ్య నేతలు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు ప్రాంతాలలో జరగనున్న బహిరంగ పభలలో వారు ప్రసంగిస్తారు. కేంద్ర హోమ్ మంత్రి 15న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 25న నాగర్ కర్నూల్ లో ’మహాజన్ సంపర్క్​ అభియాన్’లో భాగంగా జరిగే సభలో మాట్లాడతారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సభలకు కూడా భారీ ఎత్తున జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ హవా తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో జాతీయ నేతలు పాల్గొనే ఈ రెండు సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.