క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

ముద్ర.వనపర్తి:-క్రీడా పోటీలల్లో గెలుపు ఓటములు సహజమని కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు అన్నారు.వనపర్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న జిల్లాస్థాయి T20  టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు ప్రారంభించారు.

T20 టెన్నిస్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్ లో 40 టీం లు పాల్గొంటుండగా మ్యాచ్ 7 రోజులపాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని, స్నేహపూర్వకంగా ఆటలు ఆడాలని సూచించారు మ్యాచ్ లో ఎవరు గెలిచినా అందరు సంతోషంగా ఉండాలని వనపర్తి జిల్లా పేరును నిలబెట్టాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమిత్ర యాదగిరి, జయసుధ మధు గౌడ్ చీర్ల  సత్యం, విభూతి నారాయణ, లక్ష్మీ రవి యాదవ్,  మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, సుక్కరాజు తిరుపతయ్య, ఆర్ బి రవి సాగర్, లతీఫ్, అస్లం, మసూర్ అలీ, నరేష్ సాగర్ ,ఈశ్వర్ గౌడ్, కార్తీక్, అల్ట్రా నాసిర్ హమీద్, మెట్రో బాబ్జి, రంగం రమేష్, పజాల్, రఘు యాదవ్, కంచరవి, జంగిడి రాజు, నరేష్ కుమార్,ఆర్గనైజర్స్ ప్రకాష్ మహమ్మద్, రఫీక్, తిరుపతి ఎస్ మూర్తితదితరులు పాల్గొన్నారు.