అభివృద్ధికి పట్టం కట్టండి..

అభివృద్ధికి పట్టం కట్టండి..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి  జయశంకర్ భూపాలపల్లి:అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ ను గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19వ వార్డుల్లో ఎమ్మెల్యేగండ్ర వెంకటరమణా రెడ్డి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు చిన్న గ్రామంగా ఉన్న భూపాలపల్లి నేడు జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకొని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, సైడ్ డ్రైన్స్, త్రాగునీరు తదితర సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.