అభివృద్దే ధ్యేయం.. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

అభివృద్దే ధ్యేయం.. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గం చిన్న శంకరంపేట మండలం టి. మాందాపూర్ లో గ్రామ పంచాయితీ భవనం,  ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదివారం ప్రారంభించారు. గవ్వలపల్లిలో యూత్ భవనo  ప్రారంభించారు. గేరిళ్ల తండాలో సిసి రోడ్ ను ప్రారంభించారు. మల్లుపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రం ఆవిష్కరించారు. మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. రుద్రారం గ్రామ పంచాయితీ భవనo ప్రారంభించారు. ఈ కారక్రమం లో సర్పంచ్ లు, ఎంపిటిసి లతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.