మంత్రి కొండా సురేఖకు తీవ్ర అనారోగ్యం ... వీడియో రూపంలో ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ

ముద్ర,హైదరాబాద్: గత వారం రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ ఫీవర్ బారిన పడడంతో వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నానని, అందువల్లే బడ్జెట్ సమావేశాల చివర్లో అసెంబ్లీకి హాజరుకాలేకపోయానని ఆమె తెలిపారు.ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నానని... ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని దేవాదాయ మంత్రి తెలిపారు. తన పరిస్థితిని ప్రజలు, కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను... త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని కొండా సురేఖ తెలిపారు.