బావిలో పడి తల్లీబిడ్డలు ఆత్మహత్య

బావిలో పడి తల్లీబిడ్డలు ఆత్మహత్య

చిగురుమామిడి ముద్ర న్యూస్: తల్లీబిడ్డలు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మునుపాల అంజలి, గగన్‌ భార్యాభర్తలు.

వీరికి తనూశ్రీ(05) కూతురు ఉంది. ఎప్పటిలాగే ఇంటివాకిలిని అలికేందుకు పేడ తెస్తానని చెప్పిన అంజలి కూతురు తనూశ్రీని వెంటవెంటకొని వెళ్లింది. పొద్దుపోయినా ఇంటికి తిరిగిరాకపోయేసరికి బంధువులు, గ్రామస్తులు పరిసరాల్లో వెదికారు. గ్రామ శివారులోని బీరప్ప ఆలయం వద్ద గల బావిలో శవమై కనిపించారు. కుటుంబ కలహాలతోనే తల్లీబిడ్డలు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి తల్లి ఓదవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిగురుమామిడి పోలీసులు తెలిపారు.