జాతీయ పంచాయతీ అవార్డుల కోసం విశేష కృషి చేసిన వారికి సన్మానం

జాతీయ పంచాయతీ అవార్డుల కోసం విశేష కృషి చేసిన వారికి సన్మానం
చిగురుమామిడి ముద్ర న్యూస్: జాతీయ పంచాయతీ అవార్డు కొరకై విశేషంగా కృషిచేసిన మండలంలోని గ్రామాల సర్పంచ్ లకు, ఎంపిటిసిలకు, కార్యదర్శులు, మండల అధికారులను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పంచాయతీలను గుర్తించి ప్రోత్సహించేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా వివిధ కేటగిరీల కింద జాతీయ పంచాయతీ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
ఇందులో భాగంగా 2021-2022 సంవత్సరంలో మండలంలోని గ్రామపంచాయతీలు 9 అంశాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఏడు గ్రామాలు నా నామినేట్ కాబడ్డాయని ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. గాగిరెడ్డి పల్లె, కొండాపూర్ గ్రామాలు 9, లంబాడిపల్లె మూడు, ముల్కనూరు, చిగురుమామిడి రెండు, ముదిమాణిక్యం ఒక అంశం మీద నామినేటెడ్ కాబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, ఎంపీఓ శ్రావణ్ కుమార్, సూపరిండెంట్ ఖాజా మోహినుద్దీన్, సర్పంచులు ఎంపీటీసీలు, కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.