ఈ నెల 4న మద్యం లాటరీ లకు నోటిఫికేషన్‌..!

ఈ నెల 4న మద్యం లాటరీ లకు నోటిఫికేషన్‌..!

ముద్ర హైదరాబాద్‌: రానున్న రెండేళ్ల కాలానికి (2023-25) గాను రాష్ట్రం లోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌ షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్‌ శాఖ ప్రారంభించింది..

ఈ మేరకు ఈ నెల 4న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియ పై అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గ దర్శనం చేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 4న నోటిఫికేషన్‌ రానుండగా, అదే రోజు నుంచి దరఖాస్తులను స్వీకరించ నున్నారు. 

ఈ నెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించ నున్నట్లు సమాచారం. 

అయితే, గత రెండేళ్ల పాలసీ నే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది..