స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ ను సందర్శించిన అధికారులు
![స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ ను సందర్శించిన అధికారులు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6464baaae6fc3.jpg)
ముద్ర,జమ్మికుంట: ఈరోజు ఏ శ్రీనివాస్ జాయింట్ కమిషనర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తేదీ 17.5.2023 నుంచి 23. 5. 2023 వరకు జరుగుచున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో భాగంగా గ్రామపంచాయతీ విలాసాగర్ ను సందర్శించినారు. విలాసాగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, జి పి నర్సరీ, కంపోస్ట్ షెడ్డు,అవెన్యూ ప్లాంటేషన్ గ్రేవ్ వాటర్ మేనేజ్మెంట్ పనులను పర్యవేక్షించినారు. అలాగే గ్రామంలో ప్రతినిత్యం ప్రతిరోజు సానిటేషన్ నిరంతరం జరగాలని ,గ్రామాన్ని ఎల్లప్పుడూ పచ్చదనం పరిశుభ్రతతో ఉంచాలని గ్రామ ప్రజల జీవన ప్రమాణ పెంపుకై కృషి చేయాలని కోరినారు .ఇట్టి కార్యక్రమంలో డిఎల్పిఓ కరీంనగర్ హరికృష్ణ, హుజరాబాద్ డిఎల్పీఓ శ్రీలత, ఎంపీడీవో జి.కల్పన , ఎంపీ ఓ ఎస్.సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీ జి మనోహర్ రెడ్డి ,గ్రామ సర్పంచి పింగళి రమాదేవి వీరి వెంట పాల్గొన్నారు