పోలీస్ సురక్ష దినోత్సవం

పోలీస్ సురక్ష దినోత్సవం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా... పోలీస్ సురక్ష దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి ఫ్లై ఓవర్ వద్ద భారీ వాహన ర్యాలీని బెలూన్లు ఎగురవేసి, జెండా ఊపి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

అశేషంగా హాజరైన పోలీసులు, పట్టణ ప్రజలు బైకులు, కార్లు, ఇతర వాహనాల్లో ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలకు మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు. ర్యాలీ అప్పన్నపల్లి, ఎనుగొండ, షా సాబ్ గుట్ట, న్యూ టౌన్, బస్టాండ్ సర్కిల్ మీదుగా తెలంగాణ చౌరస్తాకు చేరుకుంది. తెలంగాణ చౌరస్తాలో మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.