గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో విద్యుత్తు బిల్లుల అందజేత

గృహజ్యోతి లబ్ధిదారులకు జీరో విద్యుత్తు బిల్లుల అందజేత

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తు జీరో బిల్లులను శుక్రవారం లబ్ధిదారులకు అధికారులు అందజేశారు. బీబీనగర్ మండల వ్యాప్తంగా మొత్తం 7,688 మంది దరఖాస్తుదారులు ఈ గృహజ్యోతి పథకం కింద లబ్ధిపొందనున్నట్టు అధికారులు వెల్లడించారు.

విద్యుత్తు అధికారులు ఏడీఈ ఆర్.కృష్ణయ్య, ఏఈ మనోహర్ రెడ్డి, లైన్ ఇన్ స్పెక్టర్ యాదగిరిల పర్యవేక్షణలో జీరో విద్యుత్తు బిల్లులను లబ్ధిదారులకు అందించారు. గృహజ్యోతి పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు వుంటే, నేరుగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తమ దరఖాస్తులు సమర్పించి, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ప్రయోజనాన్ని పొందాలని వారు సూచించారు. అధికారులతో లైన్ మెన్ బాల నర్సింహా, జూనియర్ లైన్ మెన్, సిబ్బంది ఉన్నారు.