వేతనాల కోసం రాయికల్ కార్మికుల నిరసన...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత ఆరు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని రాయికల్ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ పెంచిన వేతనాలు కూడా ఇవ్వడం లేదని, వేతనాలు అడిగితే పనిలో నుండి తీసివేస్తామని వెంకటస్వామి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.