రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి
![రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646a15af730a3.jpg)
కోదాడ, ముద్ర:దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరు సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నా దేహం అయినా ముక్కలు కానిస్తాను కాని దేశాన్ని ముక్కలు కానివ్వనని రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ రక్షణకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు.
దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన రాజీవ్ గాంధీ ఆశయాలను కార్యకర్తలు సాధించాలన్నారు. అనంతరం రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాస్, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, గంధం యాదగిరి, డాక్టర్ వహీద్ ,ఆవుదొడ్డి ధన మూర్తి, సంపెట రవి ,ముసుకు శ్రీనివాస్ రెడ్డి ,కాంపాటి శ్రీనివాస్, సైదిబాబు, భాయిజాన్ అలీ, గునుగుంట్ల సాయి ,ముస్తఫా, చిత్తలూరి శివయ్య, రవి నాయక్ ,దావెల్, దాదావలి, గాలి శ్రీను ,శోభన్ ,శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.