ఎద్దుల పందాలలో హుజూర్ నగర్ ఎస్ ఎస్ ఆర్ బుల్స్ విజయం.

ఎద్దుల పందాలలో హుజూర్ నగర్ ఎస్ ఎస్ ఆర్ బుల్స్ విజయం.

హుజూర్ నగర్, టౌన్, ముద్ర:-ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వేములపల్లి మండలం భూమయ్య గారి పల్లెలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జాతీయస్థాయి ఎద్దుల పందాల్లో సీనియర్స్ విభాగంలో హుజూర్ నగర్ కు చెందిన ఎస్ ఎస్ ఆర్ బుల్స్ మొదటి బహుమతి సాధించి రూ.1 లక్ష రూపాయల నగదును గెలుచుకున్నట్లు హైదరాబాద్ అడిషనల్ ఎస్పీ సుంకి సురేందర్ రెడ్డి తెలిపారు. 20 నిమిషాల సమయంలో 250 అడుగుల పొడవు గల కోర్టులో 3 వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి.