కోదాడ నియోజకవర్గంలో శుక్రవారం శశిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

కోదాడ నియోజకవర్గంలో శుక్రవారం శశిధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

ముద్ర ప్రతినిధి ,కోదాడ:- కోదాడ నియోజకవర్గంలో శుక్రవారం రోజున బి ఆర్ ఎస్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మoతరెడ్డి . శశిధర్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు . కాగితారామచంద్రాపురం లో నూకల భద్రమ్మ పార్థివ దేహానికి పులా మాల్ వేసి కుటుంబసభ్యులను పరామర్శించారు , అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన కాంపాటి. వీరయ్య కుటుంబసభ్యులను కూడా పరామర్శించారు . అనంతరం మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రాపోలు .

పుల్లమ్మ దశదిన ఖర్మ లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు . అనంతరం కోదాడ మాజీ జెడ్పిటీసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గరిణే. కోటేశ్వరరావు సతీమణి ఇటీవల మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బుర్రా . చరణ్ పాల్ రెడ్డి - జ్యోతి ల కుమార్తె ధాత్రి పట్టువస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు . తమ్మర గ్రామ మాజీ సర్పంచ్ సామినేని వెంకటేశ్వరరావు ని ఆయా నివాసంలో కలసి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు .