యువత స్వయం కృషితో ఎదగాలి

యువత స్వయం కృషితో ఎదగాలి
  • స్నాకర్స్ జోన్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శనగాని రాంబాబు గౌడ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- యువత స్వయం కృషితో ఎదిగి వ్యాపార రంగాల్లో రాణించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక యస్వీ ఇంజనీరింగ్ కళాశాల, యన్టీఆర్ పార్క్ వద్ద చోట్ ఏర్పాటు చేసిన స్నాకర్స్ జోన్ షాపు ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువుకొని ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందకుండా తమకు అనుకూలంగా ఉన్న రంగాలలో రాణించాలని సూచించారు. అదేవిధంగా షాపులు ఏర్పాటు చేసుకుని జీవన భృతి పొందాలని కోరారు.ఇందుకు తన వంతుగా సహకారం ఉంటుందని రాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వహకులు చోట్,ఉప్పల మధు,శివ,రహీం,రాంరెడ్డి, రావుల రాంబాబు,అమర్ తదితరులు పాల్గొన్నారు.