యాదవుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ

యాదవుల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ

సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులకు  రాజకీయంగా ద్రోహం చేసిన యాదవుల  వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని అఖిల భారత యాదవ మహాసభ నేతలు తెలిపారు. ఎన్నడూ యాదవులకు ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ, వారిని  బీఆర్ఎస్ పార్టీకి  దూరం చేయాలనే కుట్ర చేస్తోందని  మండిపడ్డారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో  మంత్రి జగదీశ్​ రెడ్డిని అఖిలభారత యాదవ మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 లో యాదవులకు ఒకే ఒక అసెంబ్లీ సీటు కేటాయించి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.2014 లో కూడా పోటీ చేసిన నలుగురు యాదవ సోదరులకు   చేయిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 2018 లో కూడా కాంగ్రెస్– టీడీపీ  కూటమిలో యాదవుల స్థానంలో అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్రను యాదవులు మర్చిపోవద్దు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదవులకు రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించినందుకు కృతజ్ఞతగా కేసీఆర్​కు ,  మంత్రి జగదీశ్​ రెడ్డి కి రాబోయే ఎన్నికల్లో  12 కు 12 అసెంబ్లీ సీట్లు గెలిపించి బహుమతిగా ఇస్తామని తెలిపారు. బలహీన వర్గాల, యాదవ   వ్యతిరేకి   కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని స్పష్టం చేశారు .