సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తా
![సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తా](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f9641fd7b5a.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఎంపీటీసీల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బోళ్ళ కరుణాకర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో బోళ్ల కరుణాకర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చైతన్యవంతులను చేసేందుకు ప్రజా ఉద్యమాల్లో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొంతమంది చేతుల్లోనే బందీ అయిందన్నారు. రాష్ట్ర ఉద్యమంలో ముందు నడిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో సరైన సముచిత స్థానం నేటి వరకు దక్కలేదన్నారు.