భీమారం బ్రిడ్జిపై నుంచి రాకపోకల నిలుపుదల
![భీమారం బ్రిడ్జిపై నుంచి రాకపోకల నిలుపుదల](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64c38dcc48cd1.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మూసీ నది నుంచి భారీగా వరద నీరు దిగువకు వదలడంతో భీమారం బ్రిడ్జిపై నుంచి నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని తహశీల్దార్ వెంకన్న, రూరల్ ఎస్ఐ సాయిరాంలు అన్నారు. గురువారం రాత్రి భీమారం బ్రిడ్జిను సందర్శించి మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. సమీప గ్రామాల్లో ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నెంబరు 6281492368 నంబర్తో పాటు డయల్ 100ను సంప్రదించాలన్నారు.