మోడీ నియంతృత్వ పాలనకు సుప్రీం కోర్టు తీర్పు చెంప పెట్టు..

మోడీ నియంతృత్వ పాలనకు సుప్రీం కోర్టు తీర్పు చెంప పెట్టు..
  • సుప్రీం కోర్టు తీర్పు పై కాంగ్రెస్ శ్రేణులు హర్షం.. టపాసులు పేల్చి సంబురాలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పై కాంగ్రెస్ శ్రేణులు జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రం లో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా  విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జో డో యాత్ర తో కన్యా కుమారి నుండి కాశ్మీర్ వరకు భారత  జాతిని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపడితే యాత్ర కు వచ్చిన అపూర్వ స్పందన, ప్రజల్లో రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ ఓర్వలేక, మోడీ పాలనలో అవినీతి ని ప్రశ్నించినందుకు వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే, సుప్రీంకోర్టు మోడీ నియంతృత్వ పాలనకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చి, ప్రజాస్వామ్యన్ని పరిరక్షించిందని అన్నారు. మోడీ పాలనలో అవినీతి, అక్రమాలను నిలదీస్తే అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని, ప్రశ్నించే గొంతు అణచి వేస్తున్నారని, రాహుల్ గాంధీ పై బిజెపి కుట్ర పూరిత కేసులు పెట్టిందని అన్నారు. సుప్రీం కోర్టు కు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి దుర్గయ్య, గుండా మధు, గాజుల రాజేందర్, మొజొద్దిన్, బీరం రాజేశం, నేహాల్, చాంద్ పాషా, రమేష్ రావు, కమటల శ్రీనివాస్, పుప్పాల అశోక్, అజార్,రజనీ కాంత్, మొహమ్మద్ హాబీబ్, మారు గంగారెడ్డి, రాధా కిషన్, చిట్ల అంజన్న, సావాన్ తోట నరేష్, రోహిద్,  సిరాజ్, ప్రదీప్, జమీల్, భార్గవ్ పాల్గొన్నారు.