లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ - ఎంపీడీవో భాస్కర్

లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ - ఎంపీడీవో భాస్కర్

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల సంక్షేమ పథకాలలో భాగంగా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి రూ.500 లకే  సిలిండర్ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో భాస్కర్ తెలిపారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రం ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామన్నారు.గతంలో అర్హులై దరఖాస్తు చేసుకోని వారందరూ ధరకాస్తు చేసుకోవాలని, 200  లోపల ఉన్నవారికి కరెంటు బిల్లు రూ .00 రాకపోతే తక్షణమే ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఇప్పటివరకు దాదాపు 200 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.