ఆర్పీల వేతనాలు చెల్లించాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అర్ పి ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. 2023 జూన్ నుండి డిసెంబర్ వరకు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇప్పించాలని ఎమ్మెల్సీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తానని పెండింగ్ లో ఉన్న బకాయిలు ఇప్పించేలా కృషి చేస్తాను తెలిపారు.