ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సామాన్య ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణిలో చేస్తున్న ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి వారిలో నమ్మకాన్ని కల్గించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ప్రజావాణి సోమవారం కలెక్టరేట్ లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.