రైతుల ఆర్థిక  భారం తగ్గించడానికి రోబోటిక్ యంత్రంమేలు.

రైతుల ఆర్థిక  భారం తగ్గించడానికి రోబోటిక్ యంత్రంమేలు.

 ముద్ర:నంగునూరు: రైతుల ఆర్థిక  భారం తగ్గించడానికి రోబోటిక్ యంత్రం ఎంతగానో  తోడ్పడుతుందని సిద్దిపేట జిల్లా నంగునూరు మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్ ఫామ్ రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్ల సోమిరెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు బద్దిపడగ కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం రోజున మండలంలోని అక్కెనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ పంటలో ఫామ్ సాథి అనే అంకుర సంస్థ తయారు చేసిన కలుపు నివారణ,  మందు పిచికారి చేసే రోబోటిక్ యంత్రాన్ని వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా రోబో యంత్రం పని తీరును రైతులకు వివరించి రొబో యంత్రం ద్వారా కలుగు ప్రయోజనాలను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రోబోట్లను వాడి రైతుల పొలంలోని కలుపుని తీసివేయడం,స్ప్రేను సులభతరం చేసుకోవచ్చునని వివరించారు.ఇతర పరికరాలతో పోలిస్తే 50% వరకు తక్కువ ఖర్చుతో పొలాన్ని సేద్యం చేసుకోవచ్చన్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రోబోట్ లని ఆపరేట్ చేయవచ్చునని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇదే మారోబోట్ ని మీరు పూర్తిగా ఆటోమేటిక్ రూపంలో చూడవచ్చునని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. 70% వ్యవసాయ పనిలో మా రోబోట్ తోడ్పడుతుందన్నారు. దీంతో కలుపు మందు ని పూర్తిగా 100% వరకు తగ్గించవచ్చు, కలుపు మందు ని తగ్గించడం వల్ల మీ పొలంలో ఉత్పత్తి 70% పెరుగుతుందన్నారు.  ఒక ఎకరానికి రైతు సుమారు 25 వేల వరకు  ఆదా చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన రోబోట్ ని  కొనాలనే రైతులకు 20 శాతం డిస్కౌంట్ తో 3.5 లక్ష రూపాయల నుంచి 4.5  లక్ష రూపాయల వరకు వివిధ వెర్షన్లలో  అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమంతుల వెంకటేశం,  పాలమాకుల సొసైటీ చైర్మన్ ఎల్లంకి మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిప్పని నాగేందర్, ఎంపిటిసి బెదురు తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ గౌడ్, జగ్గని బాబు, నాగరపు కృష్ణ, కంపెనీ సీఈఓ సుశాంత్, సీటీఓ ఆదిత్య, కంపెనీ ప్రతినిధులు శ్రావణ్, విజయ్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు