ఇంటింటి ప్రచారం నిర్వహించిన శ్రావణి
![ఇంటింటి ప్రచారం నిర్వహించిన శ్రావణి](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_654e4a0cd12d2.jpg)
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల్ పట్టణంలోని స్థానిక 14,15,16వ వార్డులలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా బిజే పీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగాశ్రావణి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పన్నల తిరుపతి రెడ్డి,పట్టణ అధ్యక్షులు విరబత్తిని అనిల్ కుమార్,అసెంబ్లీ కన్వీనర్ మదన్మోహన్, కిషన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ముద్దం రాము, మహిళా మోర్చా నాయకురాలు మరియు బిజెపి నాయకులు పురెళ్ళ ప్రశాంత్, రాధా కిషన్, ఎర్రోజు అశోక్, ముద్దం గంగారెడ్డి, జాజర్ల రాజు, దొగ్గిలి విజయ్, మిరిపిత్తుల మధు, సంతోష్, పిల్లి బాలు, ప్రకాష్, మరియు పెద్ద ఎత్తున మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.