బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు స్థల పరిశీలన

బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు స్థల పరిశీలన

బౌద్ధ మ్యూజియం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ముద్ర ప్రతినిధి సూర్యాపేట మంగళవారం సాయంత్రం నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో భౌద్ద క్షేత్రంలో బయల్పడిన పురావస్తు సంపాదను పర్యాటకులు సందర్శించడానికి మ్యూజియం ఏర్పాటు కొరకు తుంగతుర్తి శాసనసభ్యులు డా,,గాదరి కిషోర్ కుమార్ ,జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఆర్కాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఫణిగిరిలో 2000 సంవత్సరం నుంచి 2018 వరకు జరిపిన త్రవ్వకాలలో లభించిన విగ్రహాలను, పురావస్తు సంపదను అన్నింటిని ఆర్కాలజీ డిపార్ట్మెంట్ హైదరాబాదులోని మ్యూజియం నందు భద్రపరచడం జరిగింది. ఇట్టి పురావస్తు సంపాదను ప్రజల సందర్శన కోసం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రం వద్ద గల రామాలయం గుడి వద్ద తాత్కాలిక మ్యూజియం ఏర్పాటుకు మంత్రి స్థల పరిశీలన చేశారు. 50 రోజులలో సందర్శనశాల నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్శనశాల పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ బయల్పడిన బౌద్ధ విగ్రహాలను సందర్శనశాలలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్క్ కాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డిఓ వీర బ్రహ్మచారి, డిప్యూటీ డైరెక్టర్ ఆర్ కాలేజీ నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ మ్యూజియం బి నాగరాజు, ఆర్కాలజి డిప్యూటీ డైరెక్టర్ సూర్యాపేట డి బుజ్జి, గ్రామ సర్పంచ్ కే ఉప్పలయ్య, డిఎస్పి నాగభూషణం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.