కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ముషీరాబాద్, ముద్ర: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంగళవారం రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, కెటిఆర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ లకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజవర్గం లోని బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ముషీరాబాద్ డిపో-2లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముషీరాబాద్ డిపో-2 లో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి(విఎస్ఆర్) పాల్గొని డిపో మేనేజర్ టి కిషన్ రావు, మేనేజర్ కళ్యాణి, అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కుమార్, జె.కిషన్, జిపిఆర్ రెడ్డి, రవినాథ్, కైలాసం లతో కలిసి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్, కండక్టర్లతో పాటు కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.