రేపు యాదగిరిగుట్టకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

రేపు యాదగిరిగుట్టకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి :రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యాదగిరిగుట్టకు రానున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  ఆహ్వానం మేరకు యాదగిరిగుట్టకు రానున్నారు.

సోమవారం ఉదయం 9:30నిమిషాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దేవాదాయ, అటవీ శాఖ,మంత్రి కొండ సురేఖ, రోడ్లు భవనాల, సినిమాటోగ్రాఫి శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సితక్క, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకొనున్నారు.