ఇష్టపడి చదివితే విజయం మీదే -జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి

ఇష్టపడి చదివితే విజయం మీదే -జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇష్టపడి చదివితే రాబోయే పరీక్షల్లో విజయం మీ సొంతం అవుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యార్థులను ఉద్బోధించారు. రాబోయే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం మోటివేషనల్ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ పోటీ పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో విద్య ఒక్కటే మనల్ని నడిపించే ఆయుధమని అన్నారు.

విద్యార్థులు ఈ పోటీని తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులు కనుగుణంగా తమ ప్రతిభను కూడా పెంచుకోవాలన్నారు. ఇందుకోసం సరైన సమయపాలన, నేర్చుకునే అంశాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం అవసరమన్నారు. ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితం  పెద్ద కష్టమేమీ కాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి లోకేష్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేశారు