ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నం- టీ పీ టీ ఎఫ్
ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మణిపూర్ లో మైటీ తెగకు చెందిన అగ్రకుల సభ్యులు కుకి తెగకు చెందిన ఇద్దరు ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తు,మణిపూర్ ఘటన మారన హోమం పై ఆదివారం మధ్యాహ్నం సూర్యాపేట లోని టీ పీ టీ ఎఫ్ జిల్లా శాఖ నిరసన ర్యాలీ నిర్వహించింది.
ఈ సందర్భంగా టీ పీ టీ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు పేరం ముత్తయ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ బిక్షం లు మాట్లాడుతూ మే 4 న జరిగిన ఈ దుర్మార్గ మైన సంఘటన 2 నెలల తర్వాత వెలుగు లోకి వచ్చిందన్నారు .ఇంత కాలం ఈ సంఘటన వెలుగు లోకి రాక పోవడానికి కారణాలు. తెలపాలని అన్నారు. ఈ దారుణ సంఘటన కు స్థానిక పోలీస్ లు అధికార యంత్రాంగం హ స్తం వుందని అన్నారు. ఈ ఘటన కు సంబంధించిన వీడియో దేశ వ్యాప్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే వుంటే ఈ ఘటనను సుమోట గా తీసుకుంటానని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించిందన్నారు.
మే నెల లో మణిపూర్ మైదాన ప్రాంతం లో మెజారిటీ గా వుండే మైతెయి జాతికి. పాలకులు ఆదివాసీ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడమే ఈ చిచ్చు రాజేసింది అని ఈ అల్లర్లలో ఎంతో మంది మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురవుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఆస్తులను కోల్పోయారని దారుణ మైన హింసను అనుభవిస్తున్నారని వాపోయారు.ఇంత జరుగుతున్నా స్త్రీలపై హింసకు, లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించడం లో కానీ, మణిపూర్ లో శాంతి భద్రత లను కాపాడటం లో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైపల్యం చెందాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో పీ డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, ప్రజాసంఘాల నాయకులు బుద్ధ సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, నరబోయిన వెంకట్ సంఘీభావం తెలియజేస్తూ అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని. మణిపూర్ లో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్స్ కృష్ణవేణి . టీ పూలన్,జిల్లా ఉపాధ్యక్షులు పి వీరన్న ,బండారు శ్రీనివాస్,మైలా చంద్రయ్య..ఏ మల్లారెడ్డి, ఎస్ యాకయ్య, గడ్డం కృష్ణారెడ్డి, మారోజు కృష్ణమూర్తి, అశోక్, నర్సిరెడ్డి, యాదగిరి ,పొలిశెట్టి శ్రీనివాస్, తన్నీరు రమేష్ , సిహెచ్ అంజయ్య, సట్ల శంకర్. యాదగిరి, ఎస్ రాములు , సైదులు,, సుధాకర్, మహేష్, సురేందర్, సాలయ్య, యాదగిరి రవికుమార్ మల్లికార్జున్ శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.