పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

ముద్ర,తెలంగాణ:- పోచారం శ్రీనివాస రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం శ్రీనివాస రెడ్డిని కలవాలని గేట్లు తోచుకుంటూ లోపటికి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. అదే సమయంలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఉండడంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుట బీఆర్ఎస్ పార్టి శ్రేణుల ఆందోళన చేపట్టారు. తమ పార్టీ నాయకుడి కలిసేందుకు అడ్డుకోవడం ఏంటి? అని సుమన్ ప్రశ్నించారు.