పురుగుల మందు తాగి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
ముద్ర: శంకర్ పల్లి:-అప్పుల బాధ భరించలేక పురుగుమందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రామంతపురం గ్రామంలో చోటు చేసుకుంది. శంకర్పల్లి ఎస్సై సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రామంతపురం గ్రామానికి చెందిన బక్కనోళ్ల పాండు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు చెందిన భూమి కోర్టు వివాదంలో ఉండడంతో కోర్టు కేసు నిమిత్తం అప్పులు చేశాడు అప్పుల బాధ భరించలేక ఈనెల 6న పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మద్యానికి బానిసైన మరో వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు అలంకన్ కూడా గ్రామానికి చెందిన కైలా మల్లారెడ్డి (32) మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం మద్యం మత్తులో పురుగులమందు తాగాడు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం చందానగర్ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.