కడెం ప్రాజెక్టులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కడెం ప్రాజెక్టులో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఖానాపూర్, ముద్ర :  కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టులో పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. శనివారం కడెం పోలీస్ లు మృతదేహన్ని ప్రాజెక్టు నుండి బయటకు తీశారు. మృతుని  వయసు.35 నుంచి 40 సం, రాలు ఉంటుందని, మృత దేహం శరీరం పై నీలం రంగు  అంగీ, నల్ల రంగు కాటన్ జీన్ పాయింట్,  నల్ల బెల్ట్,  చామనచాయ రంగు, బట్ట తల, కలిగి ఉన్నాడని ఎస్ఐ రాజు తెలిపారు. ఆచూకి తెలిసిన వారు క్రింది నెంబర్ లకు తెలియజేయాలని కోరారు.

ఎస్ఐ 8712659525,
సీఐ ఖానాపూర్, 8712659523, 
ఎస్డీపీఓ నిర్మల్ 
8712659510 నంబర్ల కు సంప్రదించాలని కోరారు.