పండుగల కోటి వృక్షార్చన

పండుగల కోటి వృక్షార్చన
  • మొక్కలు నాటిన జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్సీ శేరి

ముద్ర తూప్రాన్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన  కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కుచారంలో మొక్కలు నాటారు. ఈ వృక్షార్చనకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత గౌడ్, సిఎం వ్యక్తిగత కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఎంపిడిఓ యాదగిరి రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఎంపీఓ లక్ష్మి నర్సింలు, మండల పార్టీ అద్యక్షులు పురం మహేష్, ఎపివో ఆదినారాయణ, ఏఇలు మధు, అనురాధ, సీనియర్ నాయకులు పురం రవి, రమేష్ గౌడ్, మంగ్య నాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి, సర్పంచ్ నరేందర్ రెడ్డి, నర్సింలుగౌడ్, ఉదయ్ రంజన్ గౌడ్, బిక్షపతి, శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు.