శివాలయంలో హుండీ, అమ్మవారి నగలు చోరీ..

శివాలయంలో హుండీ, అమ్మవారి నగలు చోరీ..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శివాలయంలో హుండీ, అమ్మవారి నగలు చోరీకి గురైన సంఘటన షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఈదులపల్లి గ్రామంలో గురువారం వెలుగు చూసింది. ఆలయ పూజారి,  స్థానికుల కథనం ప్రకారం గ్రామంలో వెలసిన శివాలయంలోని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చివరికి పాల్పడ్డారని ఆలయంలోని హుండీ తాళాలు ధ్వంసం చేసి హుండీ డబ్బులతోపాటు అమ్మవారి పుస్తె మెట్టలు, నగలను అపహరించికెళ్ళినట్లు తెలిపారు. ఆలయ పూజారి విజయ్ ఆలయాన్ని తెరిచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడని, ఈ మేరకు నందిగామ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.