త్రిబుల్ ఐటీ కి ఇద్దరు విద్యార్థులు ఎంపిక
![త్రిబుల్ ఐటీ కి ఇద్దరు విద్యార్థులు ఎంపిక](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a2e3870aff8.jpg)
ముద్ర తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసరలోని త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయ్యారని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వేముల బాలరాజ్ సోమవారం నాడు విలేకరులకు తెలిపారు తమ మోడల్ స్కూల్ చెందిన నిమ్మన గోటి నందిని కందిమల్ల అక్షిత ఎంపికయ్యారని తెలిపారు పాఠశాలకు చెందిన విద్యార్థులు బాసరలోని త్రిబుల్ ఐటీ కి అయిన వారిని ప్రిన్సిపాల్ బాలరాజు అభినందించారు.