మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గం ధారూర్ మండలం అంపల్లి,గురు దొట్ల, శేరి గడ్డ,జీడిగడ్డ తండాలలోని 200 మంది బీఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు బీ ఆర్ఎస్ బిజెపి పార్టీలను వీడి మాజీ మంత్రివర్యులు  గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇదే మండలం నాగాసముంధర్ గ్రామానికి చెందిన 60 మంది కాంగ్రెస్ లో చేరగా వారికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రెటరీ రఘువీరారెడ్డి, మండల అధ్యక్షులు మండల అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.