కంబాలపల్లి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిప్రమాదం

కంబాలపల్లి బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిప్రమాదం

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్న బొడ్రాయి వేడుకల్లో ఈ సంఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. పురోహితుల అనుమతి లేకుండానే ఓ..మహిళ బోనంతలపై పెట్టుకొని యాగశాల లోకి రావడం.. ఆ బోనం పై ఉన్న దీపం యాగశాలకు పైకప్పుగా వేసిన గడ్డికి అంటుకోవడంతో ప్రమాదం సంబంధించినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ప్రమాదానికి కారణాలు ఏమిటో పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా యాగశాల అంటుకోవడంతో ఉవ్వెత్తున మంటలు ఎడిసిపడ్డాయి. ప్రజలంతా ఎవరి దారిన వారు పరుగులు పెట్టారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత ఘనంగా జరుపుకుంటున్న బొడ్రాయి వేడుకలో ఈసంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో నిరుత్సాహపూరిత వాతావరణం నెలకొంది. నిర్వాహకులు కంటతడి పెట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.