ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం

ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం

చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం గంగాధర మండలంలోని మధురనగర్, పత్తికుంట పల్లి గ్రామాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా మద్దత్తు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు.

మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, తోట సంధ్యా కరుణాకర్, బుర్గు గంగన్న , మహేష్ , వోడ్నాల యగ్నేష్, దూల వీరేశం, గంగాధర సుదర్శన్, రాచమల్ల భాస్కర్ ,సుద్దాల రాజశేఖర్ రెడ్డి, శంకరయ్య, తాళ్ళ లక్ష్మణ్, మంత్రి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.