గుండెపోటుతో కార్మికుడి మృతి

గుండెపోటుతో కార్మికుడి మృతి

కేసముద్రం ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన కార్మికుడు కందుకూరి శంకర్ (29) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. శంకర్ మంగళవారం తెల్లవారుజామున తనకు చాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే అతన్ని వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఫిట్స్ తో పాటు గుండెపోటు వచ్చి మృతి చెందాడని బంధువులు తెలిపారు. శంకర్ ఓ గ్రానైట్ క్వారీలో జెసిబి ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతునికి భార్య, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందడంతో శంకర్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.