వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తాం 

 కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబుద్దీన్ పాష

 మెట్‌పల్లి ముద్ర :దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి వేడుకలను టీపీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో.. ఆశయ సాధనకు కృషి చేస్తామని  కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబుద్దీన్ పాష అన్నారు. వైయస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ వైయస్ ముఖ్యమంత్రిగా బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. అభివృద్ధి ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వైయస్సార్ ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోరే రాజ్ కుమార్, గద్దల భరత్ రాజ్, కూన రాకేష్, నీరటి రాజ్ కుమార్,నిఖిల్, ఎండీ అన్వర్,సమీర్, అక్షయ్,శశాంక్ లు పాల్గొన్నారు