ఘనంగా ఆచార్య జయశంకర్ 12వ వర్ధంతి 

ఘనంగా ఆచార్య జయశంకర్ 12వ వర్ధంతి 

మహాదేవపూర్, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్  గ్రామ పంచాయతీలో తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 12వ వర్ధంతి కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సంఘం యువజన నాయకులు చీర్లవంచ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జయశంకర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. జయశంకర్ ఆశయ సాధనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, నదీ జలాల పంపిణీ, ఆంధ్ర వలస పాలకుల దోపిడీపై జయశంకర్ పోరాటం చేశారని జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్ అన్నారు. భావజాల వ్యాప్తి ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని, ఉద్యమాన్ని నడిపించడంలో కేసీఆర్ సరియైనోడని డిసెంబర్ 9 ప్రకటన సాధించేవరకు కేసీఆర్ కు అండగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కడార్ల శంకర్, కారెంగుల బాపురావు, గ్రామ పంచాయతీ సిబ్బంది సంతోష్, సందీప్, రమేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.