పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పి

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పి

ముద్ర.వీపనగండ్ల: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం లోని  వీపనగండ్ల, చిన్నంబాయి, పానగల్ మండలాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.400 మంది పోలీస్ సిఆర్పిఎఫ్ సిబ్బందితో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, సమస్యాత్మక గుర్తించిన గ్రామాలలో గట్టినిగా ఏర్పాటు చేశామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడడం కానీ, అవాంఛనీయ సంఘటన పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.